కేసులకు భయపడే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్ నేర చరత్రపై పోరాటం చేస్తామని, చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులన్ని చంద్రబాబు పరామర్శించారు.
నా జీవితంలో ఏనాడూ జైలుకెళ్లి పరామర్శించలేదు
తన రాజకీయ జీవితంలో ఏనాడూ జైలుకు వెళ్లి పరామర్శించిన దాఖలాలు లేవని, ఈరోజు జైలులో ఎనిమిది మంది కార్యకర్తలను పరామర్శించానన్నారు. కుప్పంలో అన్నక్యాంటిన్ను అడ్డుకోవడమే కాకుండా తమ నాయకులపైనే కేసులు పెట్టారని, జగన్మోహన్రెడ్డిని కూడా తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. కొందరు పోలీసులు తమ విధి నిర్వహణ మరిచిపోయారని, వారికి బాధ్యతను గుర్తుచేస్తామన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనే కాదని పులివెందుల్లో కూడా గెలవబోతున్నామని సవాల్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అమరావతి, పోలవరం పై అన్నీ అబద్దాలే చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

No comments:
Post a Comment