పవన్ కల్యాణ్ దృష్టిలో 4 నియోజకవర్గాలు?

 ఏపీ అసెంబ్లీకి 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీచేసి ఓట‌మిపాల‌య్యారు. గాజువాక‌తోపాటు ప‌శ్చిమ‌గోదావ‌రిలోని భీమ‌వ‌రం నుంచి పోటీచేసిన‌ప్ప‌టికీ రెండుచోట్లా నిరాశే ఎదురైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీప‌డ్డ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను తెలుగుదేశం పార్టీ మూడోస్థానానికి ప‌డిపోయింది. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగుపెట్టాల‌ని కృతనిశ్చయంతో ఉన్న పవన్ ఏ నియోజకవర్గం నుంచైతే సులవుగా గెలుపు గుర్రం ఎక్కవచ్చంటూ ఒక ప్రయివేటు సంస్థచేత సర్వే నిర్వహింప చేయించారు.

తిరుపతి, పిఠాపురం అత్యంత సేఫ్!


సర్వే నిర్వహించిన సంస్థ నాలుగు నియోజకవర్గాలను సూచించినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం అయితే ప‌వ‌న్ కల్యాణ్ సులువుగా గెలుపు గుర్రం ఎక్కేస్తారంటూ ఇక్క‌డి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా గతంలో ప‌లుమార్లు ఆహ్వానం పంపించారు. ఇప్పుడు సర్వేలో కూడా ఈ నియోజకవర్గం పేరు ఉంది. సంస్థ సూచించిన మరో నియోజకవర్గం చిత్తూరు జిల్లా తిరుపతి. గతంలో ప్రజారాజ్యం స్థాపించినప్పడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేసి విజయం సాధించారుకానీ సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. తిరుపతి పట్టణంలో సామాజికవర్గ దన్నుతోపాటు అభిమానుల బలం ఎక్కువ‌. దీంతో తిరుప‌తి లేదంటే పిఠాపురం అయితే పవన్ కు బాగుంటుందంటూ పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది.

Ilanti youtube channels meda action teskora..


నా జీవితంలో ఏనాడూ జైలుకు వెళ్లలేదు: చిత్తూరు స‌బ్ జైలులో చంద్ర‌బాబు!

 కేసులకు భయపడే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్‌ నేర చరత్రపై పోరాటం చేస్తామ‌ని, చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న కుప్పం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌న్ని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు.


నా జీవితంలో ఏనాడూ జైలుకెళ్లి పరామర్శించలేదు

త‌న రాజ‌కీయ జీవితంలో ఏనాడూ జైలుకు వెళ్లి ప‌రామ‌ర్శించిన దాఖ‌లాలు లేవ‌ని, ఈరోజు జైలులో ఎనిమిది మంది కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించానన్నారు. కుప్పంలో అన్న‌క్యాంటిన్‌ను అడ్డుకోవ‌డ‌మే కాకుండా త‌మ నాయ‌కుల‌పైనే కేసులు పెట్టార‌ని, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని కూడా త‌రిమికొట్టే రోజు వ‌స్తుంద‌న్నారు. కొంద‌రు పోలీసులు త‌మ విధి నిర్వ‌హ‌ణ మ‌రిచిపోయార‌ని, వారికి బాధ్య‌త‌ను గుర్తుచేస్తామ‌న్నారు. రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాద‌ని పులివెందుల్లో కూడా గెల‌వ‌బోతున్నామ‌ని స‌వాల్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్ అమ‌రావ‌తి, పోల‌వ‌రం పై అన్నీ అబద్దాలే చెబుతున్నార‌ని చంద్రబాబు మండిప‌డ్డారు.


Pegasus ..

 


Comedy😀😀😀😀😜


 

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు.. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు,..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుండి 225 వరకు పెంచాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని నిబంధనను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పర్యావర నిపుణులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులైన యూనియన్

ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్‌కు నోటీసులు జారీ చేయాలని కోరింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జమ్మూ, కశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేసిన WP(C) 237/2022తో ఈ WPని ట్యాగ్ చేయవచ్చని కూడా ఆదేశించింది. జమ్మూ – కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 లో పొందుపరిచిన విధంగా జమ్మూ-కశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుంచి 90 వరకు పెంచేందుకు 2020లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వును జతచేస్తూ ఓయూ రాజకీయ శాస్త్ర విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Source - tv9

జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం.. 2వ రోజు అప్‌డేట్స్‌

►నరసాపురం పట్టణం 8,9 వ వార్డు లలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చ...